కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా?: నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై నోరు విప్పిన కోచ్ సితాంశు కోటక్!
- గౌతమ్ గంభీర్, కోహ్లీ మధ్య విభేదాలంటూ ప్రచారం
- ప్రాక్టీస్ సెషన్లో ఇద్దరూ మాట్లాడుకోకపోవడంతో పెరిగిన అనుమానాలు
- కార్డిఫ్ వన్డే తర్వాత రూమర్లపై స్పందించిన బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్
- మ్యాచ్ రోజే వారిద్దరూ కనీసం 10 సార్లు మాట్లాడుకున్నారని స్పష్టీకరణ
- అసలు ఈ పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదన్న కోచ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఘాటుగా స్పందించాడు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనేది కేవలం పుకార్లేనని, డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లాండ్తో కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డే ముగిసిన అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కోటక్ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు.
ప్రాక్టీస్ సెషన్తో మొదలైన లొల్లి
గత ఏడాది విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పినప్పటి నుంచి, కొత్త కోచ్ గంభీర్తో అతనికి పడటం లేదనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మొదటి వన్డేకు ముందు ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తుండగా.. గంభీర్ కాస్త దూరంగా నిలబడి గమనించాడు తప్ప, నేరుగా వెళ్లి మాట్లాడలేదు. ఆ సమయంలో కోహ్లీ కేవలం బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్తోనే సుదీర్ఘంగా చర్చలు జరపడం కనిపించింది. దీన్ని పట్టుకున్న నెటిజన్లు, విశ్లేషకులు ఇద్దరి మధ్య 'కోల్డ్ వార్' నడుస్తోందంటూ సోషల్ మీడియాలో కథనాలు అల్లేశారు.
వారధులు అవసరం లేదు
ఈ రూమర్లపై మీడియా అడిగిన ప్రశ్నకు సితాంశు కోటక్ నవ్వుతూ బదులిచ్చాడు. "గౌతమ్, విరాట్ ఇద్దరూ ప్రొఫెషనల్స్. వారిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈరోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే వారు కనీసం 10 సార్లు వ్యూహాల గురించి మాట్లాడుకోవడం నేను స్వయంగా చూశాను. వారి మధ్య కమ్యూనికేషన్ కోసం నా లాంటి థర్డ్ పర్సన్ లేదా వేరే వారధులు ఎవరూ అవసరం లేదు. అసలు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు" అని కొట్టిపారేశాడు.
మ్యాచ్లోనే కోచ్కు కోహ్లీ కీలక మెసేజ్
కార్డిఫ్ వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే.. పిచ్ చాలా నెమ్మదిగా ఉందని, ఇంగ్లాండ్ బౌలర్లు వేస్తున్న షార్ట్ పిచ్ బంతులు సరిగ్గా బ్యాట్పైకి రావడం లేదనే కీలక సమాచారాన్ని కోహ్లీ స్వయంగా డ్రెస్సింగ్ రూమ్తో పాటు హెడ్ కోచ్ గంభీర్కు చేరవేశాడని కోటక్ గుర్తుచేశారు. దీని బట్టే వారి మధ్య ఉన్న సత్సంబంధాలు అర్థం చేసుకోవచ్చన్నారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం కాగా.. ఆదివారం ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరగబోయే చివరి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది.
ప్రాక్టీస్ సెషన్తో మొదలైన లొల్లి
గత ఏడాది విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పినప్పటి నుంచి, కొత్త కోచ్ గంభీర్తో అతనికి పడటం లేదనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మొదటి వన్డేకు ముందు ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తుండగా.. గంభీర్ కాస్త దూరంగా నిలబడి గమనించాడు తప్ప, నేరుగా వెళ్లి మాట్లాడలేదు. ఆ సమయంలో కోహ్లీ కేవలం బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్తోనే సుదీర్ఘంగా చర్చలు జరపడం కనిపించింది. దీన్ని పట్టుకున్న నెటిజన్లు, విశ్లేషకులు ఇద్దరి మధ్య 'కోల్డ్ వార్' నడుస్తోందంటూ సోషల్ మీడియాలో కథనాలు అల్లేశారు.
వారధులు అవసరం లేదు
ఈ రూమర్లపై మీడియా అడిగిన ప్రశ్నకు సితాంశు కోటక్ నవ్వుతూ బదులిచ్చాడు. "గౌతమ్, విరాట్ ఇద్దరూ ప్రొఫెషనల్స్. వారిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈరోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే వారు కనీసం 10 సార్లు వ్యూహాల గురించి మాట్లాడుకోవడం నేను స్వయంగా చూశాను. వారి మధ్య కమ్యూనికేషన్ కోసం నా లాంటి థర్డ్ పర్సన్ లేదా వేరే వారధులు ఎవరూ అవసరం లేదు. అసలు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు" అని కొట్టిపారేశాడు.
మ్యాచ్లోనే కోచ్కు కోహ్లీ కీలక మెసేజ్
కార్డిఫ్ వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే.. పిచ్ చాలా నెమ్మదిగా ఉందని, ఇంగ్లాండ్ బౌలర్లు వేస్తున్న షార్ట్ పిచ్ బంతులు సరిగ్గా బ్యాట్పైకి రావడం లేదనే కీలక సమాచారాన్ని కోహ్లీ స్వయంగా డ్రెస్సింగ్ రూమ్తో పాటు హెడ్ కోచ్ గంభీర్కు చేరవేశాడని కోటక్ గుర్తుచేశారు. దీని బట్టే వారి మధ్య ఉన్న సత్సంబంధాలు అర్థం చేసుకోవచ్చన్నారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం కాగా.. ఆదివారం ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరగబోయే చివరి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది.