కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాతృమూర్తి పుట్టా పోలమ్మకు లోకేశ్ నివాళి
- ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను పరామర్శించిన మంత్రి లోకేశ్
- పుట్టా మాతృమూర్తి పుట్టా పోలమ్మ మృతి పట్ల సంతాపం
- ప్రొద్దుటూరులోని నివాసంలో కుటుంబ సభ్యులకు సానుభూతి
- పుట్టా పోలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన లోకేశ్
- కడప జిల్లా పర్యటనలో భాగంగా ఈ పరామర్శ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్.. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను పరామర్శించారు. ఎమ్మెల్యే మాతృమూర్తి పుట్టా పోలమ్మ ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో, బుధవారం ప్రొద్దుటూరులోని ఆయన నివాసానికి మంత్రి వెళ్లారు.
ఈ సందర్భంగా పుట్టా పోలమ్మ చిత్రపటానికి మంత్రి లోకేశ్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పుట్టా సుధాకర్ యాదవ్ను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు వెళ్లిన మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. "మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి పుట్టా పోలమ్మ గారు ఇటీవల మరణించడంతో ప్రొద్దుటూరులోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాను. పుట్టా పోలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను" అని లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా పుట్టా పోలమ్మ చిత్రపటానికి మంత్రి లోకేశ్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పుట్టా సుధాకర్ యాదవ్ను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు వెళ్లిన మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. "మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి పుట్టా పోలమ్మ గారు ఇటీవల మరణించడంతో ప్రొద్దుటూరులోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాను. పుట్టా పోలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను" అని లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.