శేఖర్ మాస్టర్తో రగడ అంటూ వార్తలు... జానీ మాస్టర్ క్లారిటీ
- మా మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ ప్రకటన
- చిరంజీవి తామిద్దరితో మాట్లాడారన్న జానీ
- చిరంజీవికి కృతజ్ఞతలు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ల మధ్య విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పష్టతనిచ్చారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, మెగాస్టార్ చిరంజీవి తామిద్దరితో సెట్స్ పై మాట్లాడారని ఆయన తెలిపారు.
సోమవారం 'ఎక్స్' వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "శేఖర్ మాస్టర్ అన్నతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం ఒకే కుటుంబం. మా మధ్య అన్నదమ్ముల వంటి అనుబంధం ఉంది" అని జానీ మాస్టర్ పేర్కొన్నారు. తమ మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ వస్తున్న తప్పుడు వీడియోలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.
గత రెండు రోజులుగా జానీ, శేఖర్ మాస్టర్ల మధ్య ఏదో విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వ్యవహారాల్లో లేదా వృత్తిపరమైన కారణాలతోనే ఈ గొడవ తలెత్తిందని పలు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్సైట్లు కథనాలను ప్రచురించాయి.
ఈ పుకార్లు చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారని జానీ మాస్టర్ వివరించారు. ఒక సినిమా సెట్లో తమ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారని వెల్లడించారు. తాను, శేఖర్ మాస్టర్ కలిసి సంతోషంగా మాట్లాడుకున్నామని, చిరంజీవితో కలిసి భోజనం చేశామని జానీ మాస్టర్ తన పోస్టులో పేర్కొన్నారు. మెగాస్టార్ చూపిన ప్రేమ, మద్దతుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు చిరంజీవితో కలిసి సెట్స్ మీద భోజనం చేసినప్పటి ఫొటోలను కూడా జానీ మాస్టర్ పంచుకున్నారు.
సోమవారం 'ఎక్స్' వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "శేఖర్ మాస్టర్ అన్నతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం ఒకే కుటుంబం. మా మధ్య అన్నదమ్ముల వంటి అనుబంధం ఉంది" అని జానీ మాస్టర్ పేర్కొన్నారు. తమ మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ వస్తున్న తప్పుడు వీడియోలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.
గత రెండు రోజులుగా జానీ, శేఖర్ మాస్టర్ల మధ్య ఏదో విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వ్యవహారాల్లో లేదా వృత్తిపరమైన కారణాలతోనే ఈ గొడవ తలెత్తిందని పలు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్సైట్లు కథనాలను ప్రచురించాయి.
ఈ పుకార్లు చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారని జానీ మాస్టర్ వివరించారు. ఒక సినిమా సెట్లో తమ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారని వెల్లడించారు. తాను, శేఖర్ మాస్టర్ కలిసి సంతోషంగా మాట్లాడుకున్నామని, చిరంజీవితో కలిసి భోజనం చేశామని జానీ మాస్టర్ తన పోస్టులో పేర్కొన్నారు. మెగాస్టార్ చూపిన ప్రేమ, మద్దతుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు చిరంజీవితో కలిసి సెట్స్ మీద భోజనం చేసినప్పటి ఫొటోలను కూడా జానీ మాస్టర్ పంచుకున్నారు.