రైలు బోగీ మొత్తం మీరే బుక్ చేసుకోవచ్చు.. రూల్స్ ఇవే!
- పెళ్లిళ్లు, యాత్రల కోసం రైల్వే కోచ్లు బుక్ చేసుకునే సదుపాయం
- FTR పోర్టల్ ద్వారా గరిష్ఠంగా 2 కోచ్లు లేదా పూర్తి రైలు బుకింగ్
- ఒక్కో కోచ్కు రూ.50,000 సెక్యూరిటీ డిపాజిట్
- రద్దు చేసుకుంటే సమయాన్ని బట్టి ఛార్జీలు వర్తింపు
పెళ్లిళ్లు, విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన లేదా కార్పొరేట్ టూర్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో సమూహంగా ప్రయాణించేందుకు రైలులో ఏకంగా ఒక కోచ్ను లేదా మొత్తం రైలును బుక్ చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? ఇటీవల సోషల్ మీడియాలో ఓ జంట ఏసీ కూపేను హనీమూన్ సూట్గా అలంకరించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అది అనధికారిక చర్య కావడంతో రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, చట్టబద్ధంగా, అధికారికంగా రైలు కోచ్లను ఎలా బుక్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. దీనికోసమే భారతీయ రైల్వే 'ఫుల్ టారిఫ్ రేట్' (FTR) పేరుతో ఒక ప్రత్యేక సేవను అందిస్తోంది. IRCTC పోర్టల్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.
FTR బుకింగ్ ఎలా చేయాలి?
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు ప్రయాణానికి కనీసం 30 రోజుల ముందు, గరిష్ఠంగా 6 నెలల ముందుగా IRCTC అధికారిక FTR వెబ్సైట్ (ftr.irctc.co.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రయాణ తేదీ, మార్గం, అవసరమైన కోచ్ల సంఖ్య వంటి వివరాలను నమోదు చేయాలి.
రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి కోచ్కు రూ.50,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ను ఆన్లైన్లో చెల్లించాలి. ఈ మొత్తం ఒకే లావాదేవీలో చెల్లించాల్సి ఉంటుంది. పాక్షిక చెల్లింపులకు అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ విజయవంతం అయ్యాక, ఒక FTR నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత, ప్రయాణానికి కనీసం 7 రోజుల ముందుగా పూర్తి ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.
నిబంధనలు, షరతులు ఏమిటి?
ఒక సాధారణ ప్యాసింజర్ రైలుకు గరిష్ఠంగా 2 కోచ్లను మాత్రమే అదనంగా జతచేసేందుకు వీలుంటుంది. ఒకవేళ పూర్తి రైలును బుక్ చేసుకోవాలనుకుంటే, కనీసం 18 కోచ్లు (రెండు SLR/జనరేటర్ కార్లతో కలిపి), గరిష్ఠంగా 24 కోచ్లతో బుక్ చేసుకోవచ్చు.
అయితే, బుకింగ్ చేసుకున్నంత మాత్రాన కోచ్ కేటాయింపు గ్యారెంటీ కాదు. రైల్వేల కార్యాచరణ అవసరాలు, సాంకేతిక సౌలభ్యాన్ని బట్టి మాత్రమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. కోచ్లను జతచేయడం లేదా విడదీయడం అనేది రైలు కనీసం 10 నిమిషాలు ఆగే స్టేషన్లలో మాత్రమే సాధ్యమవుతుంది.
రద్దు చేసుకుంటే పరిస్థితి ఏంటి?
ఒకవేళ ప్రయాణీకులు బుకింగ్ను రద్దు చేసుకుంటే, కొన్ని ఛార్జీలు వర్తిస్తాయి. ప్రయాణానికి రెండు రోజుల ముందు రద్దు చేస్తే సెక్యూరిటీ డిపాజిట్లో 10 శాతం కోత విధిస్తారు. ఒక రోజు ముందు (4 గంటల వరకు) రద్దు చేస్తే మొత్తం ఛార్జీలో 25 శాతం, ప్రయాణానికి 4 గంటల ముందు లేదా ఆ తర్వాత రద్దు చేస్తే ఛార్జీలో 50 శాతం కోత విధిస్తారు.
ఒకవేళ రైల్వే శాఖనే సాంకేతిక కారణాల వల్ల బుకింగ్ను రద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలు వర్తించవు. ప్రయాణం ముగిసిన తర్వాత, అవసరమైన పత్రాలైన ట్రైన్ ఫోల్డర్, ప్రయాణికుల జాబితా, 'నో డ్యామేజ్' సర్టిఫికేట్ను 21 రోజుల్లోగా IRCTCకి సమర్పిస్తే, సెక్యూరిటీ డిపాజిట్ను తిరిగి చెల్లిస్తారు. కాబట్టి, ఇకపై గ్రూప్ ప్రయాణాలకు ప్లాన్ చేసేవారు అనధికారిక మార్గాలను కాకుండా, ఈ FTR సేవను ఉపయోగించుకోవడం సురక్షితం.
FTR బుకింగ్ ఎలా చేయాలి?
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు ప్రయాణానికి కనీసం 30 రోజుల ముందు, గరిష్ఠంగా 6 నెలల ముందుగా IRCTC అధికారిక FTR వెబ్సైట్ (ftr.irctc.co.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రయాణ తేదీ, మార్గం, అవసరమైన కోచ్ల సంఖ్య వంటి వివరాలను నమోదు చేయాలి.
రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి కోచ్కు రూ.50,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ను ఆన్లైన్లో చెల్లించాలి. ఈ మొత్తం ఒకే లావాదేవీలో చెల్లించాల్సి ఉంటుంది. పాక్షిక చెల్లింపులకు అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ విజయవంతం అయ్యాక, ఒక FTR నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత, ప్రయాణానికి కనీసం 7 రోజుల ముందుగా పూర్తి ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.
నిబంధనలు, షరతులు ఏమిటి?
ఒక సాధారణ ప్యాసింజర్ రైలుకు గరిష్ఠంగా 2 కోచ్లను మాత్రమే అదనంగా జతచేసేందుకు వీలుంటుంది. ఒకవేళ పూర్తి రైలును బుక్ చేసుకోవాలనుకుంటే, కనీసం 18 కోచ్లు (రెండు SLR/జనరేటర్ కార్లతో కలిపి), గరిష్ఠంగా 24 కోచ్లతో బుక్ చేసుకోవచ్చు.
అయితే, బుకింగ్ చేసుకున్నంత మాత్రాన కోచ్ కేటాయింపు గ్యారెంటీ కాదు. రైల్వేల కార్యాచరణ అవసరాలు, సాంకేతిక సౌలభ్యాన్ని బట్టి మాత్రమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. కోచ్లను జతచేయడం లేదా విడదీయడం అనేది రైలు కనీసం 10 నిమిషాలు ఆగే స్టేషన్లలో మాత్రమే సాధ్యమవుతుంది.
రద్దు చేసుకుంటే పరిస్థితి ఏంటి?
ఒకవేళ ప్రయాణీకులు బుకింగ్ను రద్దు చేసుకుంటే, కొన్ని ఛార్జీలు వర్తిస్తాయి. ప్రయాణానికి రెండు రోజుల ముందు రద్దు చేస్తే సెక్యూరిటీ డిపాజిట్లో 10 శాతం కోత విధిస్తారు. ఒక రోజు ముందు (4 గంటల వరకు) రద్దు చేస్తే మొత్తం ఛార్జీలో 25 శాతం, ప్రయాణానికి 4 గంటల ముందు లేదా ఆ తర్వాత రద్దు చేస్తే ఛార్జీలో 50 శాతం కోత విధిస్తారు.
ఒకవేళ రైల్వే శాఖనే సాంకేతిక కారణాల వల్ల బుకింగ్ను రద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలు వర్తించవు. ప్రయాణం ముగిసిన తర్వాత, అవసరమైన పత్రాలైన ట్రైన్ ఫోల్డర్, ప్రయాణికుల జాబితా, 'నో డ్యామేజ్' సర్టిఫికేట్ను 21 రోజుల్లోగా IRCTCకి సమర్పిస్తే, సెక్యూరిటీ డిపాజిట్ను తిరిగి చెల్లిస్తారు. కాబట్టి, ఇకపై గ్రూప్ ప్రయాణాలకు ప్లాన్ చేసేవారు అనధికారిక మార్గాలను కాకుండా, ఈ FTR సేవను ఉపయోగించుకోవడం సురక్షితం.