శ్రీవారి సేవలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం.. పంచెకట్టులో స్వామివారిని దర్శించుకున్న దిల్షాన్
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మాజీ కెప్టెన్ దిల్షాన్
- టీజీ20 లీగ్లో ఖమ్మం జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్
- విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న శ్రీలంక దిగ్గజం
ఈరోజు ఉదయం విరామ దర్శన సమయంలో దిల్షాన్ స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ పంచెకట్టులో కనిపించాడు. దర్శనం పూర్తయిన తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం టీటీడీ అధికారులు దిల్షాన్ను శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆలయం వెలుపలికి వచ్చిన దిల్షాన్ను చూసేందుకు భక్తులు, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. అతనితో సెల్ఫీల కోసం పోటీపడ్డారు. దిల్షాన్ కూడా ఎంతో ఓపికగా చిరునవ్వుతో అభిమానులను పలకరిస్తూ ఫొటోలకు పోజులిచ్చి వారిని ఆనందపరిచారు.