వర్షం ఎఫెక్ట్... ఇంకా ప్రారంభం కాని ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్
- ఆర్సీబీ, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం
- తడిసిన ఔట్ఫీల్డ్ కారణంగా టాస్ వేయడంలో ఆలస్యం
- ప్రస్తుతానికి వర్షం ఆగడంతో పనులు ప్రారంభించిన గ్రౌండ్ సిబ్బంది
- రాత్రి 8:15 గంటలకు పిచ్ను పరిశీలించనున్న అంపైర్లు
- నిరీక్షణలో ఉన్న ప్రేక్షకులను అలరిస్తున్న సింగర్ కనికా కపూర్
రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరగాల్సిన ఐపీఎల్ 2026 మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం కురవడంతో ఔట్ఫీల్డ్ తడిగా మారింది. దీంతో, రాత్రి 7 గంటలకు వేయాల్సిన టాస్ ఆలస్యమైంది.
ప్రస్తుతానికి వర్షం పూర్తిగా ఆగిపోయింది. మైదాన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, పిచ్పై కప్పిన కవర్లపై నిలిచిన నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. అంపైర్లు రోహన్ పండిట్, నితిన్ మీనన్ కూడా మైదానంలోకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మైదానం ఆటకు అనువుగా ఉందో లేదో పరిశీలించారు.
తాజా సమాచారం ప్రకారం, రాత్రి 8:15 గంటలకు పిచ్ను తనిఖీ చేయనున్నట్లు స్టేడియంలోని జెయింట్ స్క్రీన్పై ప్రకటించారు. ఈ తనిఖీ తర్వాతే మ్యాచ్ భవితవ్యంపై స్పష్టత రానుంది. ఈలోగా, మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులను ప్రముఖ గాయని కనికా కపూర్ తన పాటలతో అలరిస్తున్నారు.
ప్రస్తుతానికి వర్షం పూర్తిగా ఆగిపోయింది. మైదాన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, పిచ్పై కప్పిన కవర్లపై నిలిచిన నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. అంపైర్లు రోహన్ పండిట్, నితిన్ మీనన్ కూడా మైదానంలోకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మైదానం ఆటకు అనువుగా ఉందో లేదో పరిశీలించారు.
తాజా సమాచారం ప్రకారం, రాత్రి 8:15 గంటలకు పిచ్ను తనిఖీ చేయనున్నట్లు స్టేడియంలోని జెయింట్ స్క్రీన్పై ప్రకటించారు. ఈ తనిఖీ తర్వాతే మ్యాచ్ భవితవ్యంపై స్పష్టత రానుంది. ఈలోగా, మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులను ప్రముఖ గాయని కనికా కపూర్ తన పాటలతో అలరిస్తున్నారు.