జూన్ 4న వస్తున్న రామ్ చరణ్ పెద్ది... ఇది పక్కా!
- రామ్ చరణ్ 'పెద్ది' విడుదల తేదీ ఖరారు
- జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
- సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు ప్రకటన
- ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్పై భారీ అంచనాలు
- అద్భుతమైన థియేటర్ అనుభవం కోసమే విడుదల వాయిదా వేసినట్టు గతంలో వెల్లడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్టు శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో, "జూన్ 4న 'పెద్ది'ని కలవండి. థియేటర్లలో కలుసుకుందాం" అని పోస్ట్ చేశారు. ఈ మేరకు రిలీజ్ పోస్టర్ ను కూడా పంచుకున్నారు.
సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన వెంటనే ఈ ప్రకటన రావడం గమనార్హం. మే 1వ తేదీ తెల్లవారుజామున, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు 'పెద్ది' షూటింగ్ పూర్తయినట్టు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్తో తన ప్రయాణం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. "రామ్ చరణ్తో 'పెద్ది' ఒక మధురమైన ప్రయాణం. ఆయనతో పనిచేయడం చాలా ప్రత్యేకం. తెరపై పవర్హౌస్ పెర్ఫార్మర్, తెర వెనుక అద్భుతమైన స్నేహితుడు. మేమిద్దరం కలిసి సృష్టించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు" అని రత్నవేలు పేర్కొన్నారు. ప్రతి ఫ్రేమ్లో అద్భుతమైన నటనను ప్రదర్శించడమే కాకుండా, నిజ జీవితంలోనూ ఎంతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి అని చరణ్ను ఆయన కొనియాడారు.
ఈ సినిమా కోసం చివరిగా ఒక స్పెషల్ సాంగ్ను చిత్రీకరించినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. హైదరాబాద్లో రామ్ చరణ్పై ఈ పాటను చిత్రీకరించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ట్యూన్, డ్యాన్స్, గ్రాండ్ సెట్, అందులోని సర్ప్రైజ్తో ప్రేక్షకులు థియేటర్లలో ఉర్రూతలూగడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇది మరో చార్ట్బస్టర్ అవుతుందని అప్పట్లో పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ సినిమాను ముందుగా విడుదల చేయాలని భావించినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించేందుకే జూన్కు వాయిదా వేస్తున్నట్టు వారం క్రితం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. "మా సినిమా పాటలు, గ్లింప్స్కు వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. సినిమా టాకీ పార్ట్ పూర్తయింది, కేవలం ఒక పాట మాత్రమే మిగిలి ఉంది. ఎడిట్ చూసుకున్నాం, అవుట్పుట్తో చాలా సంతోషంగా ఉన్నాం. ఇంత మంచి కంటెంట్ను అత్యుత్తమంగా అందించాలనుకుంటున్నాం. అందుకే మా టెక్నీషియన్లకు, పోస్ట్ ప్రొడక్షన్ బృందానికి కాస్త ఎక్కువ సమయం ఇచ్చి, పూర్తి నాణ్యతతో మీ ముందుకు రావాలని నిర్ణయించుకున్నాం" అని ఆ ప్రకటనలో వివరించింది. అందుకే సినిమాను జూన్కు వాయిదా వేస్తున్నామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పుడు ఆ తేదీని ఖరారు చేశారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటులు శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతికంగానూ ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన వెంటనే ఈ ప్రకటన రావడం గమనార్హం. మే 1వ తేదీ తెల్లవారుజామున, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు 'పెద్ది' షూటింగ్ పూర్తయినట్టు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్తో తన ప్రయాణం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. "రామ్ చరణ్తో 'పెద్ది' ఒక మధురమైన ప్రయాణం. ఆయనతో పనిచేయడం చాలా ప్రత్యేకం. తెరపై పవర్హౌస్ పెర్ఫార్మర్, తెర వెనుక అద్భుతమైన స్నేహితుడు. మేమిద్దరం కలిసి సృష్టించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు" అని రత్నవేలు పేర్కొన్నారు. ప్రతి ఫ్రేమ్లో అద్భుతమైన నటనను ప్రదర్శించడమే కాకుండా, నిజ జీవితంలోనూ ఎంతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి అని చరణ్ను ఆయన కొనియాడారు.
ఈ సినిమా కోసం చివరిగా ఒక స్పెషల్ సాంగ్ను చిత్రీకరించినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. హైదరాబాద్లో రామ్ చరణ్పై ఈ పాటను చిత్రీకరించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ట్యూన్, డ్యాన్స్, గ్రాండ్ సెట్, అందులోని సర్ప్రైజ్తో ప్రేక్షకులు థియేటర్లలో ఉర్రూతలూగడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇది మరో చార్ట్బస్టర్ అవుతుందని అప్పట్లో పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ సినిమాను ముందుగా విడుదల చేయాలని భావించినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించేందుకే జూన్కు వాయిదా వేస్తున్నట్టు వారం క్రితం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. "మా సినిమా పాటలు, గ్లింప్స్కు వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. సినిమా టాకీ పార్ట్ పూర్తయింది, కేవలం ఒక పాట మాత్రమే మిగిలి ఉంది. ఎడిట్ చూసుకున్నాం, అవుట్పుట్తో చాలా సంతోషంగా ఉన్నాం. ఇంత మంచి కంటెంట్ను అత్యుత్తమంగా అందించాలనుకుంటున్నాం. అందుకే మా టెక్నీషియన్లకు, పోస్ట్ ప్రొడక్షన్ బృందానికి కాస్త ఎక్కువ సమయం ఇచ్చి, పూర్తి నాణ్యతతో మీ ముందుకు రావాలని నిర్ణయించుకున్నాం" అని ఆ ప్రకటనలో వివరించింది. అందుకే సినిమాను జూన్కు వాయిదా వేస్తున్నామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పుడు ఆ తేదీని ఖరారు చేశారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటులు శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతికంగానూ ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.