‘పెద్ది’పై సస్పెన్స్కు తెర.. రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చేందుకు నేడు ప్రెస్ మీట్
- ‘పెద్ది’ సినిమాపై నెలకొన్న సందేహాలకు నేటితో తెర
- విడుదల తేదీపై స్పష్టతనిచ్చేందుకు మీడియా సమావేశం
- హాజరుకానున్న దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు
- రామ్ చరణ్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ
మెగా పవర్స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. రోజురోజుకు అంచనాలు పెంచుతున్న ఈ సినిమా విడుదలపై నెలకొన్న సస్పెన్స్కు నేటితో తెరపడే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ డేట్తో పాటు ఇతర కీలక వివరాలపై స్పష్టతనిచ్చేందుకు చిత్రబృందం ఇవాళ మధ్యాహ్నం మీడియా ముందుకు రానుంది.
‘పెద్ది’ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల్లో, ముఖ్యంగా అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే, సినిమా విడుదల విషయంలో తరచూ వాయిదాలు పడుతుండటంతో మెగా ఫ్యాన్స్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇటీవల ఓ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సినిమా జూన్ 25న వస్తుందని చెప్పినప్పటికీ, ఆ తర్వాత అధికారికంగా ఎలాంటి ప్రమోషన్లు ప్రారంభించకపోవడంతో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నిర్మాత వెంకట సతీశ్ కిలారు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సాన హాజరు కానున్నారు. వారితో పాటు సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ ప్రెస్ మీట్కు కథానాయకుడు రామ్ చరణ్ హాజరవుతారా? లేదా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా ఆయన పబ్లిక్ ఈవెంట్స్లో పెద్దగా కనిపించకపోవడంతో ఈ సమావేశానికి రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరోవైపు హీరోయిన్ జాన్వీ కపూర్ హాజరయ్యే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్లో సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటనతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద ‘పెద్ది’పై ఉన్న ఎన్నో ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరుకుతుందని అందరూ ఆశిస్తున్నారు.
‘పెద్ది’ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల్లో, ముఖ్యంగా అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే, సినిమా విడుదల విషయంలో తరచూ వాయిదాలు పడుతుండటంతో మెగా ఫ్యాన్స్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇటీవల ఓ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సినిమా జూన్ 25న వస్తుందని చెప్పినప్పటికీ, ఆ తర్వాత అధికారికంగా ఎలాంటి ప్రమోషన్లు ప్రారంభించకపోవడంతో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నిర్మాత వెంకట సతీశ్ కిలారు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సాన హాజరు కానున్నారు. వారితో పాటు సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ ప్రెస్ మీట్కు కథానాయకుడు రామ్ చరణ్ హాజరవుతారా? లేదా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా ఆయన పబ్లిక్ ఈవెంట్స్లో పెద్దగా కనిపించకపోవడంతో ఈ సమావేశానికి రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరోవైపు హీరోయిన్ జాన్వీ కపూర్ హాజరయ్యే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్లో సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటనతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద ‘పెద్ది’పై ఉన్న ఎన్నో ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరుకుతుందని అందరూ ఆశిస్తున్నారు.