మాజీ మంత్రి అమర్నాథ్కు 6 నెలల జైలు శిక్ష.. 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్కు విశాఖపట్నం రైల్వే కోర్టు షాక్ ఇచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం నమోదైన ఆత్మహత్యాయత్నం కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం అమర్నాథ్ 2016 ఏప్రిల్లో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు కేజీహెచ్కు తరలించారు. అయితే, ఈ ఘటనపై అప్పటి టూటౌన్ పోలీసులు ఆయనపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన రైల్వే కోర్టు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, అమర్నాథ్పై నేరం రుజువు కావడంతో శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం అమర్నాథ్ 2016 ఏప్రిల్లో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు కేజీహెచ్కు తరలించారు. అయితే, ఈ ఘటనపై అప్పటి టూటౌన్ పోలీసులు ఆయనపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన రైల్వే కోర్టు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, అమర్నాథ్పై నేరం రుజువు కావడంతో శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు గుడివాడ అమర్నాథ్ తెలిపారు.