Polavaram: పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం
పులిసంచారంతో పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని నేలకోట కొండ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా పులి తిరుగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
ఇటీవల, నేలకోట కొండపై సంచరిస్తున్న పులిని స్థానికులు ప్రత్యక్షంగా చూశారు. సాధారణంగా మనుషులు కనబడితే దూకుడుగా వ్యవహరించే పులులకు భిన్నంగా, ఈ పులి వారిపై దాడి చేయకుండా నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాన్ని స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పులి అడుగుజాడలను అనుసరిస్తూ దానిని బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా స్థానికులకు వారు పలు కీలక సూచనలు జారీ చేశారు. పొలం పనులకు వెళ్లేవారు, అడవికి సమీపంలో ఉండేవారు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. చీకటి పడిన తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.
ఇటీవల, నేలకోట కొండపై సంచరిస్తున్న పులిని స్థానికులు ప్రత్యక్షంగా చూశారు. సాధారణంగా మనుషులు కనబడితే దూకుడుగా వ్యవహరించే పులులకు భిన్నంగా, ఈ పులి వారిపై దాడి చేయకుండా నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాన్ని స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పులి అడుగుజాడలను అనుసరిస్తూ దానిని బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా స్థానికులకు వారు పలు కీలక సూచనలు జారీ చేశారు. పొలం పనులకు వెళ్లేవారు, అడవికి సమీపంలో ఉండేవారు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. చీకటి పడిన తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.