Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
వారాంతం కావడంతో తిరుమల కొండకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం చేసుకునేందుకు సుమారు 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.
నిన్న గురువారం (ఏప్రిల్ 2) ఒక్కరోజే 62,642 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 23,887 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.18 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.
కాగా, భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు దర్శన సమయాన్ని గమనించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది.
నిన్న గురువారం (ఏప్రిల్ 2) ఒక్కరోజే 62,642 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 23,887 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.18 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.
కాగా, భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు దర్శన సమయాన్ని గమనించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది.