Iran: అమెరికా సైనికులకు ఆశ్రయమిస్తే టార్గెట్ తప్పదు.. గల్ఫ్ హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా సైనికులకు ఆశ్రయం కల్పిస్తున్న బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని హోటళ్లకు అల్టిమేటం ఇచ్చింది. అమెరికా సైనిక సిబ్బందికి ఆశ్రయం కల్పించడం కొనసాగిస్తే, ఆ హోటళ్లను చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ ఫార్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్, దాని మిత్రపక్షాలు జరిపిన క్షిపణి దాడుల తర్వాత అమెరికా సైనికులు తమ స్థావరాలను వీడి ఈ ప్రాంతంలోని హోటళ్లలో తలదాచుకుంటున్నారని ఫార్స్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. విదేశీ సైనిక సిబ్బందికి ఆశ్రయం కల్పించే ఏ హోటల్కైనా ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది.
ఈ విషయంపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కూడా స్పందించారు. అమెరికా సైనికులు తమ స్థావరాల నుంచి పారిపోయి, పౌర ప్రాంతాలను కవచంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. "ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల్లోని సైనిక స్థావరాల నుంచి పారిపోయిన అమెరికా సైనికులు హోటళ్లు, కార్యాలయాల్లో దాక్కుంటున్నారు. వారు జీసీసీ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారు" అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు జరిపి, అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ సైనిక కమాండర్లను హతమార్చాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.
పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్, దాని మిత్రపక్షాలు జరిపిన క్షిపణి దాడుల తర్వాత అమెరికా సైనికులు తమ స్థావరాలను వీడి ఈ ప్రాంతంలోని హోటళ్లలో తలదాచుకుంటున్నారని ఫార్స్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. విదేశీ సైనిక సిబ్బందికి ఆశ్రయం కల్పించే ఏ హోటల్కైనా ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది.
ఈ విషయంపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కూడా స్పందించారు. అమెరికా సైనికులు తమ స్థావరాల నుంచి పారిపోయి, పౌర ప్రాంతాలను కవచంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. "ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల్లోని సైనిక స్థావరాల నుంచి పారిపోయిన అమెరికా సైనికులు హోటళ్లు, కార్యాలయాల్లో దాక్కుంటున్నారు. వారు జీసీసీ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారు" అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు జరిపి, అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ సైనిక కమాండర్లను హతమార్చాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.