Jagan Mohan Reddy: పదో తరగతి విద్యార్థులకు 'ఆల్ ది బెస్ట్' చెప్పిన జగన్

Jagans Best Wishes to AP 10th Class Students for Exams

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వైసీపీ అధినేత జగన్ 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.


ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ స్పందిస్తూ, విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ఏకాగ్రతతో ఉండాలని, తమపై తాము నమ్మకం ఉంచి కష్టపడితే కచ్చితంగా విజయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని ఆయన సూచించారు.


మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం విద్యాశాఖ పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచడంతో పాటు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.

Jagan Mohan Reddy
AP 10th Class Exams
SSC Exams AP
Andhra Pradesh SSC
AP Board Exams
10th Class Exams 2024
AP Education Department
Free RTC Bus
AP SSC Public Exams
YSRCP

More Telugu News