Putta Mahesh: డ్రగ్స్ కేసు... ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కు స్టేషన్ బెయిల్ మంజూరు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. సోమవారం (మార్చి 16) పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలేసినట్టు తెలిసింది.
ఎంపీ మహేశ్ యాదవ్తో పాటు మరో నిందితురాలైన ప్రియాంక రెడ్డికి కూడా స్టేషన్ బెయిల్ లభించినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసు దర్యాప్తును ఈగల్ టీమ్ వేగవంతం చేసింది. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారి నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు. ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, నిందితులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేశ్ సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలినట్లు పోలీసులు తెలిపారు.
ఎంపీ మహేశ్ యాదవ్తో పాటు మరో నిందితురాలైన ప్రియాంక రెడ్డికి కూడా స్టేషన్ బెయిల్ లభించినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసు దర్యాప్తును ఈగల్ టీమ్ వేగవంతం చేసింది. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారి నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు. ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, నిందితులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేశ్ సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలినట్లు పోలీసులు తెలిపారు.