ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రెండో పాట విడుదలకు ముహూర్తం ఖరారు
- ఉస్తాద్ భగత్ సింగ్లో రెండో సింగిల్ విడుదలకు సిద్దమైన చిత్రబృందం
- ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో రానున్న ఈ పవర్ఫుల్ యాంథమ్ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్
- తాజాగా పోస్టర్ విడుదల
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 26న గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన తొలి పాట ‘దేఖ్లేంగే సాలా’ ఫ్యాన్స్ను ఫిదా చేయగా.. ఇప్పుడు రెండో సింగిల్ విడుదలకు చిత్రబృందం సిద్ధమైంది.
ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో రానున్న ఈ పవర్ఫుల్ యాంథమ్ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా తాజాగా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మిక్స్తో ఈ చిత్రం భారీ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా పోస్టర్లో పవన్ కల్యాణ్ ఎదుట భారీ జనసముద్రం కనిపించడం ఆకట్టుకుంటుండగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ -హరీష్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం, పైగా డీఎస్పీ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో రానున్న ఈ పవర్ఫుల్ యాంథమ్ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా తాజాగా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మిక్స్తో ఈ చిత్రం భారీ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా పోస్టర్లో పవన్ కల్యాణ్ ఎదుట భారీ జనసముద్రం కనిపించడం ఆకట్టుకుంటుండగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ -హరీష్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం, పైగా డీఎస్పీ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.