ఏపీ వనం.. అద్భుత భూతల స్వర్గం.. దాన్ని మ‌న‌మే కాపాడుకోవాలి: సాయి దుర్గా తేజ్

Discover Andhra Documentary Showcases Andhra Pradesh Wildlife Sai Durga Tej
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుతమైన ప్రకృతి అందాలు, అటవీ సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో 'డిస్కవర్ ఆంధ్ర' అనే డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్ మన్నెపురి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, యంగ్ హీరో నవదీప్ సారథ్యం వహిస్తున్నారు. ఏపీ అటవీ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రూపొందుతున్న ఈ డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ, మన సంస్కృతిని, ప్రకృతిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. "మన చుట్టూ ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఈ డాక్యుమెంటరీ చూస్తే తప్పక అనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం 2020లో 'గ్రీన్ పాస్' అనే ఎన్జీవో ప్రారంభించాను. నా 'రిపబ్లిక్' సినిమాలో కూడా ఇదే అంశాన్ని చర్చించాం. ఈ డాక్యుమెంటరీకి మణిశర్మ మ్యూజిక్ అందించడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రయత్నాలకు ప్రేక్షకులు, మీడియా మద్దతుగా నిలవాలి" అని కోరారు.

హీరో నవదీప్ మాట్లాడుతూ.. ఈ డాక్యుమెంటరీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం ఎలా లభించిందో వివరించారు. "ఆంధ్రలోని వైల్డ్‌లైఫ్‌ను ప్రపంచానికి చూపించాలనే తన కోరికను సాయి తేజ్ నాతో పంచుకున్నారు. నేను వెంటనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన తక్షణమే స్పందించి, ప్రాజెక్టుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేలా చూశారు. 72 నిమిషాల నిడివితో శ్రీకాంత్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ చూసి మన రాష్ట్రంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోతారు" అని తెలిపారు.

పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ డాక్యుమెంటరీ, ఏపీలోని అద్భుత‌మైన ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందుతోంది.


Go Back to Shorts
Discover Andhra
Sai Durga Tej
Andhra Pradesh
Pawan Kalyan
Navdeep
Srikanth Mannepuri
Wildlife
Documentary
Green Pass NGO
Environmental Protection

More Telugu News