Kadiyam Srihari: కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు
- తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొన్న స్పీకర్
- ఈరోజుతో 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై పూర్తి కానున్న విచారణ
- ఈ నేపథ్యంలో ఇద్దరికి మరోసారి నోటీసులు జారీ చేసిన స్పీకర్
ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ ఆయన ఈ నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా, సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు.
ఈ రోజుతో 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సభాపతి వారిద్దరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని అందులో పేర్కొన్నారు. విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సభాపతి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా, సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు.
ఈ రోజుతో 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సభాపతి వారిద్దరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని అందులో పేర్కొన్నారు. విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సభాపతి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.