Pinnelli Ramakrishna Reddy: పోలీసుల ఎదుట విచారణకు హాజరైన పిన్నెల్లి సోదరులు

Pinnelli Brothers Attend Police Inquiry in Double Murder Case
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి శనివారం నాడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి వీరిద్దరినీ విచారించేందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, పిన్నెల్లి సోదరులు ఇద్దరూ ఈరోజు మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారణను ఎదుర్కొన్నారు.

ఈ కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసే క్రమంలో పోలీసులు వారిని ప్రశ్నించడానికి పిలిచారు. పోలీసుల ఆదేశాల మేరకు అన్నదమ్ములిద్దరూ స్టేషన్‌కు విచ్చేశారు.

గత ఎన్నికల తర్వాత కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, ఈ కేసు విచారణతో తొలిసారిగా బయటకు రావడం గమనార్హం. 
Go Back to Shorts
Pinnelli Ramakrishna Reddy
Pinnelli brothers
Macharla
Gundlapadu double murder case
YSRCP
Andhra Pradesh politics
Police investigation
Veludurthi
Pinnelli Venkatrami Reddy
AP Elections 2024

More Telugu News