Raja Singh: కవిత మాట్లాడిన ఆ వ్యాఖ్యలు వాస్తవమే: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh says Kavithas comments are true
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆఫ్ ద రికార్డులో చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన సమర్థించారు. పెద్ద మొత్తంలో ప్యాకేజీ లభిస్తే బీజేపీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీతోనూ కలిసిపోతారని ఆయన ఆరోపించారు.

రాజాసింగ్ మాట్లాడుతూ, "భారీ ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌తో కలిసిపోతారు. అంతేకాకుండా, బీజేపీ తరఫున ఎవరు, ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా వారే నిర్ణయిస్తారు. గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దానివల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయింది" అని తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ కొందరు బీజేపీ నేతలు ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యారని, ఈ అంతర్గత కుమ్మక్కుల వల్లే పార్టీకి నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజాసింగ్ సూచించారు. "వాస్తవానికి మన పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇతర పార్టీల నాయకులతో మన సొంత పార్టీ నేతలు కుమ్మక్కు కావడం అందరికీ తెలిసిన విషయమే" అని ఆయన వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Raja Singh
BJP
BRS
Kavitha
Telangana Politics
BJP Leaders
Internal Politics

More Telugu News