పహల్గామ్ దాడి.. ఉగ్రవాదంపై మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు
- అంగోలా అధ్యక్షుడితో ఢిల్లీలో ప్రధాని మోదీ భేటీ
- సంయుక్త మీడియా సమావేశంలో పహల్గామ్ దాడి ప్రస్తావన
- ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలకు కట్టుబడి ఉన్నామని వెల్లడి
- భారత్ పోరాటానికి అంగోలా మద్దతుకు కృతజ్ఞతలు
- ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ప్రమాదమని ఉద్ఘాటన
ఇటీవల జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా ప్రభుత్వం మద్దతు ఇవ్వడం పట్ల మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
"ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువు. దీనిని ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులు, వారికి అండగా నిలిచే వారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
భారత్, అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.