పాక్ సైన్యానికి బలూచిస్తాన్లో ఎదురుదెబ్బ
- బలూచిస్తాన్లో శుక్రవారం శక్తివంతమైన పేలుడు
- ఏడుగురు పాక్ సైనికులు హతం
- దాడికి పాల్పడింది తామే అని ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)
- పాక్ సైనికుల చర్యలను వ్యతిరేకిస్తూ బలూచిస్తాన్ వ్యాప్తంగా బలూచి యాక్టెహ్తి కమిటీ (బీవైసీ) పిలుపుతో భారీ నిరసనలు
బలూచ్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామే అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచిస్థాన్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బలూచ్ ప్రజలు ఇప్పటికే తమకు స్వాతంత్ర్యం కావాలని నినదిస్తూ పాక్ సైనికులు, అధికారులే లక్ష్యంగా బీఎల్ఏ దాడులకు పాల్పడుతోంది.
మరోపక్క స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న బలూచ్ ప్రజలను పాక్ ప్రభుత్వం క్రూరంగా హింసించడం, జైలులో పెట్టడం, పాక్ ఆర్మీ కిడ్నాప్ చేస్తున్న ఘటనలకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ వ్యాప్తంగా బలూచి యాక్టెహ్తి కమిటీ (బీవైసీ) శుక్రవారం భారీ నిరసనలకు పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో తుర్బాట్, పంజ్గూర్, నొకుండి, దర్బందిన్, యక్మాచ్, చార్సర్, మష్టేల్, ఓర్మాగే, చాఘి, అమీనాబాద్, ఖరక్, కరాచీ, ఉతల్, గదాని, నుష్మి, కలాట్, మస్తుంగ్ వంటి వివిధ నగరాల్లో నిరసనలు జరిగాయి.