మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఒంటిపూట బడుల టైమింగ్స్ లో మార్పు
- పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మంత్రి నిర్ణయం
- పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం పూట తరగతులు
- మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలన్న మంత్రి
ఈ నేపథ్యంలో స్కూలుకు వచ్చిన విద్యార్థులు పదో తరగతి జవాబు పత్రాలు పంపించేంత వరకు ఎండలో వేచి చూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒంటిపూట బడులను మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.