Pawan Kalyan: జనసేన ఆవిర్భావ సభకు బయల్దేరిన పవన్ కల్యాణ్

ఈ మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. 'జయకేతనం పేరిట జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాదులోని తన నివాసం నుంచి బయల్దేరారు. 

ఆయన ఇంటి నుంచి బయటికి రాగానే, అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. పవన్ వారందరికీ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన సోషల్ మీడియా వింగ్ జనసేన శతఘ్ని పంచుకుంది. 
Pawan Kalyan
Jayakethanam
Pithapuram
Janasena

More Telugu News