సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
- ఆపరేషన్ ఆక్టోబస్ 3.0లో భాగంగా వారిని అరెస్టు చేసిన పోలీసులు
- 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు
- 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల గుర్తింపు
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ నేరగాళ్ళకు 20 మంది పీవోఎస్ ఏజెంట్లు సహకారం అందించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 10 మంది వోడాఫోన్ ఐడియా, ఏడుగురు ఎయిర్టెల్, ముగ్గురు జియో పీవోఎస్ ఏజెంట్లను అరెస్టు చేశారు. సిమ్ కోసం వచ్చిన వారికి తెలియకుండా మరో సిమ్ యాక్టివేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.