రాజధాని అమరావతిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
- మూడేళ్లలో రాజధానిని పూర్తి చేస్తామన్న మంత్రి
- నిర్మాణానికి ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోమని స్పష్టీకరణ
- హడ్కో, ప్రపంచ బ్యాంకు రుణాలతో రాజధానిని నిర్మిస్తామని వెల్లడి
రాజధాని విషయంలో వైసీపీ ఇప్పటికైనా ఒక విధానంతో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో వైసీపీ నాయకులు ఒత్తిడికి గురయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే రాజధాని విషయమై జగన్, ఆ పార్టీ నేతలు సైకోల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అమరావతిలో భూముల అమ్మకం ద్వారా వచ్చిన నిధులను మాత్రమే రాజధాని నిర్మాణం కోసం వినియోగిస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ధరలు పెరుగుతాయని తెలిపారు. బడ్జెట్లో రాజధాని కోసం కేటాయించిన రూ. 6 వేల కోట్లను ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి మాత్రం తీసుకోబోమని వివరించారు.