Advertisement

ఇసుక అక్రమ రవాణాపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

Revanth Reddy fires at sand illegal mining
  • ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం
  • జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక రీచ్‌లను తనిఖీ చేయలని ఆదేశం
  • ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చూడాలని సూచన
ఇసుక అక్రమ రవాణాపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక రీచ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టకుండా చూడాలని సూచించారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలన్నారు. కాగా, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Advertisement
Revanth Reddy
Congress
Telangana

More Telugu News