రూ.89 వేలకు చేరిన బంగారం ధర... లక్ష రూపాయలు దాటిన వెండి
- తులం బంగారం రూ.1,300 పెరిగి రూ.89,000కు చేరిన పసిడి
- ఈరోజు రూ.2 వేలు పెరిగిన కిలో వెండి
- అంతర్జాతీయ మార్కెట్లో 2,960 డాలర్లు పలికిన ఔన్స్ బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3 వేల డాలర్లకు చేరువైంది. ఈరోజు అత్యధికంగా 2,960 డాలర్లు పలికింది. వెండి ఔన్సు 34 డాలర్లకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి వస్తున్న ప్రకటనలు మార్కెట్ను అనిశ్చితికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.