ఢిల్లీలో 500కు చేరుకున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు
- రోజురోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యత
- ఈ సీజన్లో ఇదే అత్యధికం
- సుప్రీంకోర్టు ఆదేశాలతో జీఆర్ఏపీ స్టేజ్-4 ఆంక్షలు అమల్లోకి
- పెట్రోల్, డీజిల్ వాహనాల ప్రవేశానికి అనుమతి నిల్
- తాము చెప్పే వరకు ఆంక్షలు ఎత్తివేయవద్దని సుప్రీం ఆదేశం
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న స్టేజ్-4 ఆంక్షల ప్రకారం.. నిత్యావసరాలతోపాటు ఎల్ఎన్జీ, సీఎన్జీ, బీఎస్-6 డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలు మినహా ఇతర ట్రక్కులు, వాహనాలు నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదు. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన తేలికపాటి వాణిజ్య వాహనాలకు కూడా అనుమతి లేదు. అయితే, అవి ఎలక్ట్రిక్ వాహనాలు అయితే మాత్రం అనుమతిస్తారు. నిర్మాణ పనులు, పబ్లిక్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేశారు. పొగమంచు దట్టంగా కురుస్తున్నప్పటికీ రైలు సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే, 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కాలుష్యం కారణంగా 9 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.