దేశం నుంచి పారిపోయిన షేక్ హసీనా... సైన్యం చేతికి బంగ్లాదేశ్ పాలన
- ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో 100 మందికి పైగా మృతి
- ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు
- ఢాకాలోని ప్రధాని ప్యాలెస్ దిశగా దూసుకొచ్చిన వేలాది మంది నిరసనకారులు
- సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిన షేక్ హసీనా
- హింసకు ముగింపు పలకాలని ఆర్మీ చీఫ్ జనరల్ వకీర్ విజ్ఞప్తి
ఇదిలా ఉండగా, షేక్ హసీనా హెలికాప్టర్లో ఢాకా నుంచి భారత్కు వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. షేక్ హసీనా, ఆమె సోదరి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి ఢాకా అధికార భవన్ నుంచి బయలుదేరారని మీడియాలో వార్తలు వచ్చాయి.
సైన్యం చేతుల్లోకి పాలన
షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో దేశ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా ఆర్మీ చీఫ్ జనరల్ వకీర్ ఉజ్ జమాన్ ప్రకటించారు. ఈ సందర్భంగా, హింసకు ముగింపు పలకాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత సైన్యానిదే అన్నారు.