Chandrababu: వేదిక వద్దకు చేరుకున్న నారా లోకేశ్, భువనేశ్వరి... నోవాటెల్ నుంచి బయల్దేరిన అమిత్ షా, నడ్డా

Nara Lokesh and family members arrives Chanadrababu oath taking ceremony stage

  • కాసేపట్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం
  • ఉదయం 11.27 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనున్న చంద్రబాబు
  • చంద్రబాబుతో పాటు ప్రమాణం చేయనున్న 24 మంది మంత్రులు

ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూడా ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నారు. నందమూరి చైతన్యకృష్ణ, నారా రోహిత్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 

అటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  జేపీ నడ్డా విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి కేసరపల్లి ఐటీ పార్కుకు బయల్దేరారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. 

చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల్లో సభా ప్రాంగణం, 65 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రముఖులు, వివిధ దేశాల కాన్సులేట్ జనరల్స్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో, 7 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

Chandrababu
Oath Taking
Nara Lokesh
Nara Bhuvaneswari
Nara Brahmani
TDP Mahanadu
Andhra Pradesh
  • Loading...

More Telugu News