ఓటమి బాధలో ఉన్న సంజు శాంసన్కు షాక్.. రాజస్థాన్ సారధికి భారీ జరిమానా!
- సంజు శాంసన్కు రూ.12 లక్షల జరిమానా
- 'స్లో ఓవర్ రేట్' కారణంగానే ఫైన్ వేసినట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడి
- నిన్న జైపూర్ వేదికగా ఆర్ఆర్, జీటీ మధ్య మ్యాచ్
- చివరి బంతికి ఓడిన రాజస్థాన్ రాయల్స్
మరోవైపు నిన్నటి మ్యాచులో పరాజయంతో సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ ఈ ఐపీఎల్ సీజన్లో తొలి ఓటమిని చవిచూసింది. ఆఖరి బంతి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో గుజరాత్ బ్యాటర్ రషీద్ ఖాన్ బౌండరీ బాదడంతో ఆర్ఆర్కు పరాజయం తప్పలేదు. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడి, నాలుగు విజయాలు నమోదు చేయడం విశేషం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది.