కోల్కతా ఆసుపత్రిలో మిథున్ చక్రవర్తికి సర్జరీ.. పరామర్శించిన సీఎం సువేందు అధికారి
- గతంలో ప్రమాదానికి గురైన మిథున్ చక్రవర్తి
- ఒక మెటల్ ప్లేట్ను తొలగించిన వైద్యులు
- మిథున్ చక్రవర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సువేందు అధికారి
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడు మిథున్ చక్రవర్తి (76) కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గతంలో జరిగిన ప్రమాదం కారణంగా శారీరకంగా అమర్చిన ఒక మెటల్ ప్లేట్ను తొలగించడానికి వైద్యులు ఆయనకు చిన్న శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆసుపత్రికి వెళ్లి మిథున్ చక్రవర్తిని పరామర్శించి, వైద్యులతో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా మిథున్ సర్జరీ విషయం, ఆయన కోలుకుంటున్న తీరును పంచుకుంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మిథున్ చక్రవర్తి ఈ విషయాన్ని ముందుగా గోప్యంగా ఉంచాలని భావించారని... ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని సీఎం తెలిపారు.