ముంబైలో ల‌గ్జ‌రీ ఫ్లాట్ కొన్న టీమిండియా యువ క్రికెట‌ర్‌ పృథ్వీ షా.. నెట్టింట ఫొటోల వైర‌ల్‌!

Prithvi Shaw buys new lavish apartment in Bandra
  • బాంద్రాలో స‌ముద్రం ఎదురుగా వున్న అపార్ట్ మెంటులో రూ. 20 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న పృథ్వీ షా
  • కొత్త ఫ్లాట్ తాలూకు ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన యంగ్ క్రికెట‌ర్‌
  • ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న టీమిండియా ప్లేయ‌ర్‌
టీమిండియా యువ క్రికెట‌ర్ పృథ్వీ షా ముంబైలో ఓ ల‌గ్జ‌రీ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. సుమారు రూ. 20 కోట్లు దీనికోసం వెచ్చించిన‌ట్లు స‌మాచారం. బాంద్రాలో స‌ముద్రం ఎదురుగా ఈ ఫ్లాట్ ఉంటుంది. ఈ కొత్త ఫ్లాట్ తాలూకు ఫొటోల‌ను పృథ్వీ షా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. దాంతో ఆ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ఇక పృథ్వీ షా ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) కు ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఈ డాషింగ్ ఓపెన‌ర్‌ను డీసీ ఏకంగా రూ. 8 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. 2018లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన పృథ్వీని ఢిల్లీ మొద‌ట‌ రూ. 1.2 కోట్లకు ద‌క్కించుకుంది. అప్ప‌టి నుంచి అత‌డు డీసీ త‌ర‌ఫునే ఆడుతున్నాడు. అయితే, మొద‌టి సీజ‌న్‌లో ప‌ర్వాలేద‌నిపించిన షా.. ఆ త‌ర్వాత సీజ‌న్ల‌లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. కానీ, 2021 నుంచి అత‌డు మ‌ళ్లీ త‌న మునుప‌టి ఫామ్‌ను అందుకున్నాడు. 

2021లో 15 మ్యాచుల్లో ఏకంగా 479 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత 2022లో 10 మ్యాచులు ఆడి 283 ర‌న్స్ కొట్టాడు. ఇక‌ గ‌తేడాది పృథ్వీ బ్యాట్ నుంచి అంత‌గా ప‌రుగులు రాలేద‌నే చెప్పాలి. 8 మ్యాచుల్లో కేవ‌లం 106 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. తాజా సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 3 మ్యాచుల్లోనే 119 ప‌రుగులు చేశాడు. ప‌వ‌ర్ ప్లేలో మోస్ట్ డేంజ‌ర‌స్ ఓపెన‌ర్‌గా పృథ్వీ షాను పేర్కొన‌డం జ‌రుగుతోంది. ఎందుకంటే పృథ్వీ  క్రీజులో ఉన్నంత‌సేపు అత‌ని బ్యాట్ నుంచి ప‌రుగుల వ‌ర‌ద పారాల్సిందే.
Go Back to Shorts
Prithvi Shaw
Lavish apartment
Bandra
Mumbai
IPL 2024
Delhi Capitals
Team India
Sports News
Cricket

More Telugu News