పూర్ణచంద్రరావుకు విజయసాయిరెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి: కనకమేడల
- ప్రభుత్వ సహకారం లేకుండా రూ. 50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ చేయడం సాధ్యమేనా అన్న కనకమేడల
- బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి శుభాకాంక్షలు చెప్పారని వ్యాఖ్య
- లిక్కర్ కంపెనీలు డ్రగ్స్ కలుపుతున్నాయని ఆరోపణ
కూనం వీరభద్రరావుకు అంత పెట్టుబడి పెట్టే స్తోమత ఉందా అని కనకమేడల ప్రశ్నించారు. ఆ కంపెనీ రికార్డులు చెక్ చేశారా అని అడిగారు. ఈ ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలో ఉంటున్నాయని చెప్పారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, సంధ్య కంపెనీకి సంబంధం లేదని అన్నారు. డ్రగ్స్ ను లిక్కర్ కంపెనీలు వాటి ఉత్పత్తుల్లో కలుపుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయని... దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీలో నాసిరకం లిక్కర్ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని మండిపడ్డారు. మద్య నిషేధం చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ... ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.