మాపై బురద చల్లేందుకే శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు: హరీశ్ రావు
- పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో అన్నీ అబద్ధాలే చెప్పారన్న హరీశ్
- ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులను తామే పూర్తి చేశామన్న హరీశ్
- మేడిగడ్డకు వెంటనే రిపేర్లు చేయించాలని డిమాండ్
కావాలనే మేడిగడ్డ ప్రాజెక్ట్ మరమ్మతులను ఆలస్యం చేస్తున్నారని హరీశ్ విమర్శించారు. అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమని తాము ఇప్పటికే చెప్పామని అన్నారు. తమపై ఉన్న కోపంతో ప్రజలను అన్యాయం చేయొద్దని కోరారు. వర్షాలు పడేలోగా రిపేర్లు చేయించాలని కోరారు. ప్రాణహిత చేవెళ్లను తాము మార్చాలనుకోలేదని... ఇంజినీరింగ్ అధికారులు చెప్పినందుకే రీడిజైనింగ్ చేశామని చెప్పారు.