అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య.. రామ్ లల్లా విగ్రహం తొలి ఫొటో ఇదిగో!
- నిలబడిన రూపంలో రామ్ లల్లా నల్లరాతి విగ్రహం
- ఐదేళ్ల బాలుడిగా కనిపించిన రామయ్య
- ముఖం పరదాతో కప్పివున్న తొలి ఫొటో విడుదల
కాగా జనవరి 22న 'ప్రాణప్రతిష్ఠ' కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి భక్తులు ‘అయోధ్య రాముడు’ని దర్శించుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 11,000 మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. వారిలో క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్తో పాటు పలువురు సెలబ్రిటీలు ఉన్నారు.