తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యూఇయర్ గిఫ్ట్!
- ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- డిసెంబర్ 28 నుంచి మరో రెండు హామీలను అమలు చేయాలనే యోచన
- మహిళలు, వృద్ధులకు ప్రయోజనం చేకూరే హామీల అమలుపై ఆలోచన
మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, చేయూతలో భాగంగా పెన్షన్ రూ.4 వేలకు పెంపు హామీలను అమలు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు గాంధీ భవన్లో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరు గ్యారెంటీలలో తదుపరి హామీల అమలుపై చర్చించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు హామీలను డిసెంబర్ 28వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీంతో మహిళలు, వృద్ధులకు ప్రయోజనం చేకూరనుంది.