జనసేన, సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్

Nara Lokesh thanked Janasena and CPI workers
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
  • బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ
  • నేటి బంద్ లో పాలుపంచుకున్న జనసేన, సీపీఐ కార్యకర్తలు
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ చేపట్టిన బంద్ లో టీడపీ శ్రేణులతో పాటు జనసేన, సీపీఐ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, నిరసనలపై పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతల సూచనలు, సలహాల మేరకు తదుపరి కార్యాచరణకు ప్రణాళిక రూపొందించారు. 

ఈ సందర్భంగా, తమకు మద్దతిచ్చిన జనసేన, సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని లోకేశ్ తెలిపారు. టీడీపీ నిరసనలను అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని వాడుతున్నారని ఆరోపించారు. 

కాగా, ఈ సాయంత్రం 6 గంటలకు లోకేశ్ రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జైలు సమీపంలోని విద్యానగర్ క్యాంప్ సైట్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు.
Go Back to Shorts
Nara Lokesh
TDP
Bandh
Janasena
CPI
Chandrababu
Arrest
Andhra Pradesh

More Telugu News