ఢిల్లీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న పవన్ కల్యాణ్
- మంగళగిరి పార్టీ కార్యాలయానికి జనసేనాని
- ఢిల్లీలో బీజేపీ పెద్దలతో వరుస భేటీలు
- అమిత్ షా, జేపీ నడ్డా తదితరులతో సమావేశం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వెంకయ్య నాయుడు తదితరులతో సమావేశమయ్యారు. అమిత్ షాతో దాదాపు పదిహేను నిమిషాలు చర్చించారు. ఈ రోజు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. నడ్డాతో గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ మేరకు జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది. నడ్డాతో పవన్ భేటీ అయ్యారని, వీరి మధ్య ప్రధానంగా ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళికల గురించి చర్చించారని, ఈ సందర్భంగా రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించినట్లు తెలిపింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారన్నారు.