ఏపీ జెన్ కో గెస్ట్ హౌస్ లో భారీ కొండచిలువ కలకలం

అల్లూరి జిల్లా లోయర్ సీలేరు ప్రాజెక్టు వద్ద ఉన్న ఏపీ జెన్ కో గెస్ట్ హౌస్ లో భారీ కొండచిలువ అందరినీ హడలెత్తించింది. రాత్రివేళ విధుల్లో ఉన్న సిబ్బంది ఈ కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. 

స్థానికంగా నివాసం ఉంటున్న జెన్ కో ఉద్యోగి చింతా రాంబాబు ఈ కొండచిలువపై సమాచారం అందుకుని, హుటాహుటీన గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ఆ భారీ సర్పాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. 

ఆ కొండచిలువను అటవీ సిబ్బందికి అప్పగించగా, వారు దాన్ని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా, ఆ కొండచిలువ 12 అడుగుల పొడవు ఉన్నట్టు గుర్తించారు.


More Telugu News