Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్నకు గుండెపోటు.. యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు

Nandamuri Taraka Ratna suffered heart stroke

  • కుప్పం పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్న
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స
  • స్టంట్ వేయకుండానే కోలుకున్న తారకరత్న

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను హుటాహుటిన కారులో కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన గుండెపోటుకు గురయ్యారని గుర్తించారు. వెంటనే ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను బెంగళూరుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

గత కొన్ని రోజులుగా తారకరత్న విశ్రాంతి లేకుండా ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పర్యటనకు సంబంధించి అన్నీ ఆయనే చూసుకున్నారు. ఇప్పుడు కుప్పంలో పాదయాత్రకు సంబంధించి కూడా ఆయన పర్యవేక్షణ చేశారు. కుప్పంకు ముందే చేరుకుని పనులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఎంతో అలసిపోయారు. ఈ ఉదయం నుంచి కూడా ఉత్సాహంగానే ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Nandamuri Taraka Ratna
Telugudesam
Heart Stroke
Kuppam
Padayatra
  • Loading...

More Telugu News