డ్వాక్రా మహిళ ఇచ్చిన సమాధానంతో షాకయిన అవంతి శ్రీనివాసరావు
- సున్నా వడ్డీని చంద్రబాబు మాఫీ చేశారా అంటూ ప్రశ్నించిన అవంతి
- చేశారు సార్ అని సమాధానం ఇచ్చిన డ్వాక్రా మహిళ
- సభకు వచ్చే వారికి ట్రైనింగ్ ఇవ్వాలన్న అవంతి
దీనికి సమాధానంగా ఆమె... చేశారని చెప్పింది. దీంతో, అవంతి షాక్ కు గురయ్యారు. చేయలేదు సార్ అంటూ అక్కడున్న సంబంధిత అధికారిణి చెప్పారు. దీంతో, సభకు వచ్చే డ్వాక్రా మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలంటూ ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాలు చాలా మారిపోయాయని చెప్పారు. రాజకీయ నేతలు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారని... పైసా సంపాదన లేకుండా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వ పథకం వస్తే అధికారులు ఎంతోకొంత ఆశపడతారని... ఇప్పుడు వారి నోరు కూడా ఎండిపోతోందని చెప్పారు.