Gongadi Trisha: టీమిండియా అండర్-19 జట్టుకు ఎంపికైన భద్రాచలం అమ్మాయి త్రిష

  • మహిళల క్రికెట్లో చిచ్చరపిడుగు గొంగడి త్రిష
  • ఎనిమిదేళ్లకే జిల్లా స్థాయి జట్టుకు ఎంపిక
  • 12 ఏళ్లకే హైదరాబాద్ మహిళల జట్టులో స్థానం
  • తాజాగా న్యూజిలాండ్ తో సిరీస్ కు ఎంపిక
  • లెగ్ స్పిన్, పవర్ హిట్టింగ్ తో రాణిస్తున్న త్రిష
Gongadi Trisha gets place in Team India under 19 team

భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష టీమిండియా అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. భారత అండర్-19 అమ్మాయిల జట్టు న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు త్రిషకు కూడా చోటు కల్పించారు. 

త్రిష ఎనిమిదేళ్ల వయసులోనే ఎంతో ప్రతిభ చూపి జిల్లాస్థాయి అండర్-16 జట్టుకు ఆడింది. ఆపై 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. అంతేకాదు, త్రిష 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది. చిన్న వయసులోనే బీసీసీఐ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. 

త్రిష ప్రధానంగా లెగ్ స్పిన్నర్. అయితే బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో  రాణిస్తూ ఆల్ రౌండర్ గా ఎదుగుతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరిట ఉంది.

  • Loading...

More Telugu News