ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణాన్ని ప‌రిశీలించిన సీఎం కేసీఆర్‌

ts cm kcr visits trs party office construction in new delhi
  • ములాయం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన కేసీఆర్‌
  • అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లిన వైనం
  • వ‌సంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ కార్యాల‌యం
  • గంట‌కు పైగా కార్యాల‌య ప‌నుల‌ను ప‌రిశీలించిన వైనం
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు వెళ్లిన కేసీఆర్ అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం రాత్రి ఢిల్లీలోనే బ‌స చేసిన కేసీఆర్‌... బుధ‌వారం వ‌సంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ప‌రిశీలించారు. 

ఈ సంద‌ర్భంగా దాదాపుగా గంట‌కు పైగానే అక్క‌డే ఉన్న కేసీఆర్‌... కార్యాల‌య నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. అక్క‌డ ప‌నిచేస్తున్న ఇంజినీర్ల‌తో ప‌నుల‌పై స‌మీక్షించారు. కార్యాల‌య భ‌వ‌న నిర్మాణంలో ప్ర‌తి అంశాన్ని కేసీఆర్ కూలంక‌షంగా ప‌రిశీలించారు. ఇదిలా ఉంటే... మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాల‌యాన్ని కేసీఆర్ ప‌రిశీలించిన సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
Telangana
TRS
KCR
New Delhi
BRS

More Telugu News