ఢిల్లీలో కేసీఆర్... బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన తెలంగాణ సీఎం
- ములాయం అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్
- ఆ తర్వాత యూపీ నుంచే ఢిల్లీకి పయనం
- సర్దార్ పటేల్ మార్గ్లోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరిక
- పలు పార్టీల నేతలు, మేథావులతో భేటీ కానున్న సీఎం
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యే దాకా కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ కార్యాలయం కోసం సర్దార్ పటేల్ మార్గ్లోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రకటన రోజే ఈ భవనానికి బీఆర్ఎస్ రంగులు అద్దారు. ఈ కార్యాలయాన్నే కేసీఆర్ మంగళవారం పరిశీలించారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయంలో ఆయన పలు పార్టీలకు చెందిన నేతలతో పాటు మేథావులతోనూ చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే ఈ టూర్లో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.