Lakshman: ఎన్డీయేలోకి టీడీపీ అంటూ ప్రచారం... స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP leader Lakshman responds on speculations of TDP alliance with NDA
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ ఎంపీ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్డీయేలోకి టీడీపీ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. అది కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు. ఎన్డీయేలోకి టీడీపీ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ భాగస్వామి జనసేన అని స్పష్టం చేశారు. తాము ఏపీలో జనసేనతోనే కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. ఒకవేళ టీడీపీతో భాగస్వామ్యం కుదిరితే ఆ విషయం అందరికీ తెలియజేస్తామని లక్ష్మణ్ అన్నారు. ఏపీలో సీఎం జగన్ పట్ల ప్రజావ్యతిరేకత ఉందని, దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటామని చెప్పారు.
Go Back to Shorts
Lakshman
BJP
TDP
NDA
Janasena
Andhra Pradesh

More Telugu News