దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 16,167 కేసుల నమోదు
- మొన్నటితో పోలిస్తే 2571 కేసుల తగ్గుదల
- ప్రస్తుత క్రియాశీల కేసులు 1,35,510
ప్రస్తుతం దేశంలో 1,35,510 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,34,99,659కి చేరుకుంది. రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైంది. క్రియాశీల రేటు 0.31 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా నమోదైంది. రోజువారీ పాటిజిటి రేటు మాత్రం 6.14 శాతంగా ఉంది. ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 206,56,54,741 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 34,75,330 మందికి వ్యాక్సిన్ అందజేశారు.