ఓటమితో కొన్ని విపక్షాల వైఖరిని తప్పుబట్టిన మార్గరెట్ అల్వా
- కొన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా నిలిచాయన్న కాంగ్రెస్ నేత
- ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయాలని చూశాయన్న అల్వా
- అలా చేయడం ద్వారా వారి విశ్వసనీయతే దెబ్బతిన్నట్టు విమర్శ
‘‘ఈ ఎన్నిక ప్రతిపక్షాలన్నీ కలసి పనిచేసేందుకు, గతాన్ని మరిచి, తమ మధ్య విశ్వాసాన్ని ఏర్పరుచుకునేందుకు అవకాశం కల్పించింది. కానీ, దురదృష్ట వశాత్తూ కొన్ని ప్రతిపక్షాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి మద్దతు పలికాయి. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేశాయి. అలా చేయడం ద్వారా ఆయా పార్టీలు, వాటి నేతలు సొంత విశ్వసనీయతను దెబ్బతీసుకున్నారు. ఎన్నిక ముగిసింది. కానీ, మన రాజ్యాంగం, ప్రజాస్వామ్య పటిష్ఠతకు, పార్లమెంటు గౌరవం పునరుద్ధరణ కోసం పోరాటం కొనసాగుతుంది’’అని అల్వా పేర్కొన్నారు.