Sensex: వరుసగా ఐదో రోజు లాభపడ్డ మార్కెట్లు

Markets ends in profits
  • 284 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 84 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 8 శాతానికి పైగా లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. వరుసగా ఐదో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. యూరప్ దేశాలకు రష్యా గ్యాస్ సరఫరా మొదలు కావడం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు లాభపడి 55,682కి పెరిగింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 16,605 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (8.09%), బజాజ్ ఫైనాన్స్ (3.41%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.52%), ఏసియన్ పెయింట్స్ (2.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.72%).   

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-1.92%), కోటక్ బ్యాంక్ (-1.05%), రిలయన్స్ (-0.58%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.16%), ఎన్టీపీసీ (-0.07%).
Sensex
Nifty
Stock Market

More Telugu News