అధ్యక్ష ఎన్నికలకు ముందు.. శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటన
- నేటి నుంచే అమల్లోకి ఎమర్జెన్సీ
- అధ్యక్ష ఎన్నికలకు రేపే నామినేషన్ల స్వీకరణ
- ఎల్లుండే అధ్యక్షుడి ఎన్నిక
- రేసులో ప్రధాన ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస
ప్రజా భద్రత, శాంతిభద్రతలు, ప్రజాసేవల నిర్వహణ ప్రయోజనాల దృష్ట్యా దేశంలో పబ్లిక్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టు గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని శ్రీలంక పార్లమెంటు ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. నిజం గెలుస్తుందన్న నమ్మకం ఉండడం వల్లే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్టు ఇటీవల ఆయన పేర్కొన్నారు.